థియేటర్లకు శుభవార్త చెప్పిన కేంద్రం
- September 04, 2025
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం సినిమా అభిమానులకు పెద్ద గిఫ్ట్ అందించింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇది నిజమైన శుభవార్త. వినోద రంగంపై ఉన్న పన్ను భారాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్లు, థియేటర్లలో విక్రయించే పాప్కార్న్పై జీఎస్టీ రేట్లు సవరించబడ్డాయి.ఈ మార్పు వల్ల చిన్న థియేటర్లకు ఆర్థిక ఊరట లభించనుంది.తాజా నిబంధనల ప్రకారం రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్లపై జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అంటే ఇప్పుడు చిన్న పట్టణాల్లో సినిమా చూడటం మరింత చవకగా మారనుంది. అయితే రూ.100 కంటే ఎక్కువ ధర పలికే టికెట్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీ యథాతథంగానే కొనసాగుతుంది. దీనివల్ల మల్టీప్లెక్స్లు లేదా ప్రీమియం థియేటర్లకు పెద్దగా లాభం ఉండదు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రం ఇది నిజమైన ఊరటగా మారబోతోంది.
ప్రేక్షకులు థియేటర్లో ఎక్కువగా కొనేవి పాప్కార్న్. కానీ దీని మీద జీఎస్టీ విషయంలో గతంలో గందరగోళం నెలకొనేది. ఇప్పుడు ప్రభుత్వం ఈ సమస్యను క్లియర్ చేసింది. ఇకపై ప్యాకేజింగ్ ఎలా ఉన్నా, సాల్టెడ్ పాప్కార్న్పై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుంది. అయితే క్యారమెల్ పాప్కార్న్పై మాత్రం 18 శాతం పన్ను విధిస్తారు. గతంలో ప్యాకేజ్డ్, లూజ్ పాప్కార్న్లకు వేర్వేరు రేట్లు ఉండగా, ఇప్పుడు స్పష్టమైన నిబంధన తీసుకువచ్చారు.ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ పన్ను భారంతో నష్టాల్లో ఉన్న థియేటర్లు ఈ మార్పుతో నిలదొక్కుకునే అవకాశముంది. అదే సమయంలో ప్రేక్షకులు కూడా తక్కువ ధరలో సినిమాలు చూడగలుగుతారు. ఫలితంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్ల సందడి పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







