లక్కీ ఇండియన్స్.. చేజిక్కిన Dh15 మిలియన్ల జాక్ పాట్..!!
- September 05, 2025
యూఏఈ: బిగ్ టికెట్ అబుదాబి తన ఆగస్టు జాక్పాట్ విజేతను ప్రకటించింది. సెప్టెంబర్ 3న జరిగిన లైవ్ డ్రాలో ఒక భారతీయ ప్రవాసి Dh15 మిలియన్లు గెలుచుకున్నాడు. దుబాయ్లో నివసించే 30 ఏళ్ల టెక్నీషియన్ సందీప్ కుమార్ ప్రసాద్.. ఆగస్టు 19న 200669 నంబర్ టికెట్ ను కొనుగోలు చేసి, విజేతగా నిలిచాడు.
ఉత్తరప్రదేశ్కు చెందిన డ్రైడాక్ కార్మికుడు సందీప్ మూడు సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తున్నాడు. తాను గెలిచానని తెలుసుకున్నప్పుడు, అతను భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇప్పుడు అతను కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి, తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, తన కుటుంబంతో కలిసి నిలబడటానికి భారతదేశానికి తిరిగి రావాలని కలలు కంటున్నాడు.
తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని, ఇది తనను తీవ్రంగా బాధితుందన్నారు. ఈ ప్రైజ్ మనీతో తన వారిని ఆదుకోవడానికి మరియు వారికి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు. 20 మంది స్నేహితులతో కలిసి టిక్కెట్ కొనుగోలు చేస్తూ.. గత మూడు నెలలుగా డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు.
గ్రాండ్ ప్రైజ్తో పాటు, సెప్టెంబర్ 3 డ్రాలో ఆరుగురు ఒక్కొక్కరు దిర్హం 100,000 గెలుచుకున్నారు. విజేతలలో దుబాయ్లో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన రంజిత్ నాయర్, ఇండయన్ రంజిత్ నాయర్, జోర్డాన్కు చెందిన నిఖిల్ రాజ్ మరియు బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ రషీద్ ఉన్నారు.
బిగ్ విన్ (స్పిన్ ది వీల్) ద్వారా Dh140,000 లను జోగేంద్ర జాంగీర్ గెలుచుకున్నాడు. బహుమతి మొత్తంతో తన గృహ రుణాన్ని చెల్లించడానికి మరియు ఛారిటీకి విరాళంగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. ముంబైకి చెందిన జిజు జాకబ్ Dh130,000 గెలుచుకున్నాడు. కేరళకు చెందిన శారద్ Dh130,000 గెలిచాడు. ఇక Dh100,000 గెలుచుకున్న సత్తార్ మజీహా తన కుటుంబాన్ని అమెరికాకు ట్రిప్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. అబుదాబిలో నివసిస్తున్న మరో భారతీయ ప్రవాసుడు షమీమ్ మూలతిల్ హంజా మూలతిల్ BMW M440i ను గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









