దుబాయ్ బ్లూ లైన్ మెట్రో వర్క్.. ట్రాఫిక్ డైవర్షన్స్..!!
- September 06, 2025
యూఏఈ: దుబాయ్ మెట్రో బ్లూ లైన్ నిర్మాణ పనుల కారణంగా సెంటర్ పాయింట్ స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ వాహనదారులను అప్రమత్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 2029 సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ కొత్త దుబాయ్ మెట్రో నెట్వర్క్.. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకునేలా రోడ్ నెట్ వర్క్ ను డెవలప్ చేస్తుందని అందులో పేర్కొంది. ఈ నెట్ వర్క్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని 20 శాతం వరకు తగ్గిస్తుందని తెలిపింది.
ఎయిర్పోర్ట్ రోడ్ నుండి సెంటర్ పాయింట్ స్టేషన్లోని మల్టీ ఫ్లోర్ కార్ పార్కింగ్కు రోడ్డు మూసివేయనున్నట్లు, స్టేషన్కు చేరుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసిన సైన్బోర్డులను ఫాలో కావాలని సూచించింది.
బ్లూ లైన్ ప్రాజెక్ట్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులోని 14 స్టేషన్ల నెట్వర్క్ లో 28 రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుత రైల్వే నెట్వర్క్ ను 78 స్టేషన్లు, 131 కి.మీ.లకు విస్తరించనుంది.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







