దుబాయ్ బ్లూ లైన్ మెట్రో వర్క్.. ట్రాఫిక్ డైవర్షన్స్..!!
- September 06, 2025
యూఏఈ: దుబాయ్ మెట్రో బ్లూ లైన్ నిర్మాణ పనుల కారణంగా సెంటర్ పాయింట్ స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ వాహనదారులను అప్రమత్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 2029 సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ కొత్త దుబాయ్ మెట్రో నెట్వర్క్.. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకునేలా రోడ్ నెట్ వర్క్ ను డెవలప్ చేస్తుందని అందులో పేర్కొంది. ఈ నెట్ వర్క్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని 20 శాతం వరకు తగ్గిస్తుందని తెలిపింది.
ఎయిర్పోర్ట్ రోడ్ నుండి సెంటర్ పాయింట్ స్టేషన్లోని మల్టీ ఫ్లోర్ కార్ పార్కింగ్కు రోడ్డు మూసివేయనున్నట్లు, స్టేషన్కు చేరుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసిన సైన్బోర్డులను ఫాలో కావాలని సూచించింది.
బ్లూ లైన్ ప్రాజెక్ట్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులోని 14 స్టేషన్ల నెట్వర్క్ లో 28 రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుత రైల్వే నెట్వర్క్ ను 78 స్టేషన్లు, 131 కి.మీ.లకు విస్తరించనుంది.
తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







