బహ్రెయిన్, సౌదీ అరేబియా ప్రయాణీకులకు గుడ్ న్యూస్..!!
- September 06, 2025
మనామా: బహ్రెయిన్ -సౌదీ అరేబియా మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. త్వరలోనే రెండు దేశాల మధ్య సముద్ర మార్గం అందుబాటులోకి రానుంది. సముద్ర మార్గాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
జెడ్డాలో జరిగిన రెండవ సముద్ర పరిశ్రమల సమావేశంలో బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య సముద్ర సంబంధాలను బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యం అని ఆయన అన్నారు.
కనెక్టివిటీని మరింత పెంచే అవకాశం ఉన్న కింగ్ హమద్ కాజ్వే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం బహ్రెయిన్ ఖలీఫా బిన్ సల్మాన్ పోర్టును దమ్మామ్లోని కింగ్ అబ్దులాజీజ్ పోర్టుతో అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రెండు దేశాల మధ్య ప్రయాణీకులు, కార్గో రవాణాను విస్తరించడానికి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







