బహ్రెయిన్, సౌదీ అరేబియా ప్రయాణీకులకు గుడ్ న్యూస్..!!
- September 06, 2025
మనామా: బహ్రెయిన్ -సౌదీ అరేబియా మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. త్వరలోనే రెండు దేశాల మధ్య సముద్ర మార్గం అందుబాటులోకి రానుంది. సముద్ర మార్గాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
జెడ్డాలో జరిగిన రెండవ సముద్ర పరిశ్రమల సమావేశంలో బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య సముద్ర సంబంధాలను బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యం అని ఆయన అన్నారు.
కనెక్టివిటీని మరింత పెంచే అవకాశం ఉన్న కింగ్ హమద్ కాజ్వే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం బహ్రెయిన్ ఖలీఫా బిన్ సల్మాన్ పోర్టును దమ్మామ్లోని కింగ్ అబ్దులాజీజ్ పోర్టుతో అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రెండు దేశాల మధ్య ప్రయాణీకులు, కార్గో రవాణాను విస్తరించడానికి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









