బహ్రెయిన్, సౌదీ అరేబియా ప్రయాణీకులకు గుడ్ న్యూస్..!!
- September 06, 2025
మనామా: బహ్రెయిన్ -సౌదీ అరేబియా మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. త్వరలోనే రెండు దేశాల మధ్య సముద్ర మార్గం అందుబాటులోకి రానుంది. సముద్ర మార్గాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
జెడ్డాలో జరిగిన రెండవ సముద్ర పరిశ్రమల సమావేశంలో బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య సముద్ర సంబంధాలను బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యం అని ఆయన అన్నారు.
కనెక్టివిటీని మరింత పెంచే అవకాశం ఉన్న కింగ్ హమద్ కాజ్వే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం బహ్రెయిన్ ఖలీఫా బిన్ సల్మాన్ పోర్టును దమ్మామ్లోని కింగ్ అబ్దులాజీజ్ పోర్టుతో అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రెండు దేశాల మధ్య ప్రయాణీకులు, కార్గో రవాణాను విస్తరించడానికి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







