EU ప్రతినిధులతో ఖతార్ పీఎం భేటీ..!!
- September 06, 2025
దోహా: ఈయూ ప్రతినిధులతో ఖతార్ పీఎం భేటీ అయ్యారు. ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థాని.. యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు HE కాజా కల్లాస్తో సమావేశమయ్యారు. ఆయన ప్రస్తుతం ఈయూ దేశాల్లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఖతార్, యూరోపియన్ యూనియన్ మధ్య సహకారాన్ని మరింత పెంచే మార్గాలపై సమీక్షించారు. అలాగే పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గాజా స్ట్రిప్, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిణామాలను సమీక్షించారు.
గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణ సాధించడానికి, పౌరుల రక్షణను నిర్ధారించడానికి కృషి చేయాలని నిర్ణయించారు. బాధితులకు మానవతా సహాయం అందించడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఖతార్ పీఎం పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







