EU ప్రతినిధులతో ఖతార్ పీఎం భేటీ..!!
- September 06, 2025
దోహా: ఈయూ ప్రతినిధులతో ఖతార్ పీఎం భేటీ అయ్యారు. ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థాని.. యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు HE కాజా కల్లాస్తో సమావేశమయ్యారు. ఆయన ప్రస్తుతం ఈయూ దేశాల్లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఖతార్, యూరోపియన్ యూనియన్ మధ్య సహకారాన్ని మరింత పెంచే మార్గాలపై సమీక్షించారు. అలాగే పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గాజా స్ట్రిప్, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిణామాలను సమీక్షించారు.
గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణ సాధించడానికి, పౌరుల రక్షణను నిర్ధారించడానికి కృషి చేయాలని నిర్ణయించారు. బాధితులకు మానవతా సహాయం అందించడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఖతార్ పీఎం పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం









