ఖతార్ పీఎంకు UK విదేశాంగ కార్యదర్శి ఫోన్..!!
- September 07, 2025
దోహా: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీకి యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ మరియు కామన్వెల్త్ వ్యవహారాల కార్యదర్శి HE య్వెట్ కూపర్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. రెండు దేశాల మధ్య సహకార సంబంధాలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శిగా య్వెట్ కూపర్ నియామకంపై ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఆమె విధులను నిర్వర్తించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిణామాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. గాజా స్ట్రిప్పై యుద్ధాన్ని ముగించడానికి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉందన్నారు. యుద్ధ బాధితులకు అడ్డంకులు లేని మానవతా సహాయాన్ని అందేలా చూడాలని కోరారు. ఖైదీలు, నిర్బంధితులను వెంటనే విడుదల చేసి, సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చర్చల ద్వారా కనుగొనాలని ఇరువురు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







