ఖతార్ పీఎంకు UK విదేశాంగ కార్యదర్శి ఫోన్..!!
- September 07, 2025
దోహా: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీకి యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ మరియు కామన్వెల్త్ వ్యవహారాల కార్యదర్శి HE య్వెట్ కూపర్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. రెండు దేశాల మధ్య సహకార సంబంధాలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శిగా య్వెట్ కూపర్ నియామకంపై ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఆమె విధులను నిర్వర్తించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిణామాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. గాజా స్ట్రిప్పై యుద్ధాన్ని ముగించడానికి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉందన్నారు. యుద్ధ బాధితులకు అడ్డంకులు లేని మానవతా సహాయాన్ని అందేలా చూడాలని కోరారు. ఖైదీలు, నిర్బంధితులను వెంటనే విడుదల చేసి, సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చర్చల ద్వారా కనుగొనాలని ఇరువురు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







