ఖతార్ పీఎంకు UK విదేశాంగ కార్యదర్శి ఫోన్..!!
- September 07, 2025
దోహా: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీకి యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ మరియు కామన్వెల్త్ వ్యవహారాల కార్యదర్శి HE య్వెట్ కూపర్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. రెండు దేశాల మధ్య సహకార సంబంధాలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శిగా య్వెట్ కూపర్ నియామకంపై ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఆమె విధులను నిర్వర్తించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిణామాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. గాజా స్ట్రిప్పై యుద్ధాన్ని ముగించడానికి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉందన్నారు. యుద్ధ బాధితులకు అడ్డంకులు లేని మానవతా సహాయాన్ని అందేలా చూడాలని కోరారు. ఖైదీలు, నిర్బంధితులను వెంటనే విడుదల చేసి, సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చర్చల ద్వారా కనుగొనాలని ఇరువురు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









