ఖతార్ పీఎంకు UK విదేశాంగ కార్యదర్శి ఫోన్..!!
- September 07, 2025
దోహా: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీకి యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ మరియు కామన్వెల్త్ వ్యవహారాల కార్యదర్శి HE య్వెట్ కూపర్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. రెండు దేశాల మధ్య సహకార సంబంధాలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శిగా య్వెట్ కూపర్ నియామకంపై ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఆమె విధులను నిర్వర్తించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిణామాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. గాజా స్ట్రిప్పై యుద్ధాన్ని ముగించడానికి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉందన్నారు. యుద్ధ బాధితులకు అడ్డంకులు లేని మానవతా సహాయాన్ని అందేలా చూడాలని కోరారు. ఖైదీలు, నిర్బంధితులను వెంటనే విడుదల చేసి, సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చర్చల ద్వారా కనుగొనాలని ఇరువురు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!







