తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
- September 07, 2025
తిరుమల: సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడబోతోంది. ఆదివారం రాత్రి 9.58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సోమవారం తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3గంటల 28 నిమిషాలు ఉంటుంది. చంద్రగ్రహణం సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూసివేస్తున్నారు. గ్రహణం నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నారు.
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేయనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. చంద్రగ్రహణం ముగిసిన తరువాత సోమవారం వేకువజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరుస్తారు. పుణ్యహవచనం, శుద్ది నిర్వహించిన తరువాత స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఆదివారం ఉదయం కంపార్ట్మెంట్లు షెడ్లలో వేచివున్న భక్తులకు మధ్యాహ్నం 1:30లోపు దర్శనంను పూర్తి చేసేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
గ్రహణ సమయంలో యాత్రిక సముదాయాలు, గదుల్లో ఉండే భక్తులకు పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్లు ప్యాకెట్లను టీటీడీ పంపిణీ చేయనుంది. భక్తులందరూ సోమవారం ఉదయం 6గంటలకు క్యూలైన్ లోకి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడ సేవను రద్దు చేయడం జరిగిందని, అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయడం జరిగిందని టీటీడీ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









