రియో ఒలింపిక్స్ క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు రెహమాన్ స్ఫూర్తి సందేశం
- July 19, 2016
రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్ఫూర్తి సందేశం ఇచ్చారు. రియో కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ నియమించిన గుడ్విల్ అంబాసిడర్లలో ఒకరైన రెహమాన్ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. రియో వెళ్లనున్న భారత ఒలింపిక్ బృందానికి సోమవారం దిల్లీలో వీడ్కోలు పలికిన అనంతరం రెహమాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
మనసు, పూర్తి శక్తి పెడితే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదని రెహమాన్ పేర్కొన్నారు. మనల్ని ఆపేవారెవరూ లేరని అన్నారు. నిరాశ పడకుండా ముందుకెళ్లడం చాలా ముఖ్యమైన అంశమని, చేసే పని మధ్యలో వదిలేయొద్దని రెహమాన్ పోస్ట్లో తెలిపారు.
ఒకప్పుడు తాను కూడా భారతీయ వ్యక్తికి ఆస్కార్ అవార్డు లేదా గ్రామీ అవార్డు రావడమనేది అసాధ్యమని అనుకునే వాడినని.. కానీ అది సాధ్యమేనని కాలం నిరూపించిందని రెహమాన్ అన్నారు. భారత్ ఈ సారి ఒలింపిక్స్కు 121 మంది అథ్లెట్లను పంపించింది. వారిలో 54 మంది మహిళలు ఉన్నారు. రెహమాన్తో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, షూటర్ అభినవ్ బింద్రా ఒలింపిక్స్ గుడ్విల్ అంబాసిడర్లుగా ఉన్నారు.
తాజా వార్తలు
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!









