రియో ఒలింపిక్స్ క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు రెహమాన్ స్ఫూర్తి సందేశం
- July 19, 2016
రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్ఫూర్తి సందేశం ఇచ్చారు. రియో కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ నియమించిన గుడ్విల్ అంబాసిడర్లలో ఒకరైన రెహమాన్ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. రియో వెళ్లనున్న భారత ఒలింపిక్ బృందానికి సోమవారం దిల్లీలో వీడ్కోలు పలికిన అనంతరం రెహమాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
మనసు, పూర్తి శక్తి పెడితే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదని రెహమాన్ పేర్కొన్నారు. మనల్ని ఆపేవారెవరూ లేరని అన్నారు. నిరాశ పడకుండా ముందుకెళ్లడం చాలా ముఖ్యమైన అంశమని, చేసే పని మధ్యలో వదిలేయొద్దని రెహమాన్ పోస్ట్లో తెలిపారు.
ఒకప్పుడు తాను కూడా భారతీయ వ్యక్తికి ఆస్కార్ అవార్డు లేదా గ్రామీ అవార్డు రావడమనేది అసాధ్యమని అనుకునే వాడినని.. కానీ అది సాధ్యమేనని కాలం నిరూపించిందని రెహమాన్ అన్నారు. భారత్ ఈ సారి ఒలింపిక్స్కు 121 మంది అథ్లెట్లను పంపించింది. వారిలో 54 మంది మహిళలు ఉన్నారు. రెహమాన్తో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, షూటర్ అభినవ్ బింద్రా ఒలింపిక్స్ గుడ్విల్ అంబాసిడర్లుగా ఉన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







