రియో ఒలింపిక్స్ క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు రెహమాన్ స్ఫూర్తి సందేశం
- July 19, 2016
రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్ఫూర్తి సందేశం ఇచ్చారు. రియో కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ నియమించిన గుడ్విల్ అంబాసిడర్లలో ఒకరైన రెహమాన్ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. రియో వెళ్లనున్న భారత ఒలింపిక్ బృందానికి సోమవారం దిల్లీలో వీడ్కోలు పలికిన అనంతరం రెహమాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
మనసు, పూర్తి శక్తి పెడితే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదని రెహమాన్ పేర్కొన్నారు. మనల్ని ఆపేవారెవరూ లేరని అన్నారు. నిరాశ పడకుండా ముందుకెళ్లడం చాలా ముఖ్యమైన అంశమని, చేసే పని మధ్యలో వదిలేయొద్దని రెహమాన్ పోస్ట్లో తెలిపారు.
ఒకప్పుడు తాను కూడా భారతీయ వ్యక్తికి ఆస్కార్ అవార్డు లేదా గ్రామీ అవార్డు రావడమనేది అసాధ్యమని అనుకునే వాడినని.. కానీ అది సాధ్యమేనని కాలం నిరూపించిందని రెహమాన్ అన్నారు. భారత్ ఈ సారి ఒలింపిక్స్కు 121 మంది అథ్లెట్లను పంపించింది. వారిలో 54 మంది మహిళలు ఉన్నారు. రెహమాన్తో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, షూటర్ అభినవ్ బింద్రా ఒలింపిక్స్ గుడ్విల్ అంబాసిడర్లుగా ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







