'తెలంగాణ ఎన్నారై పాలసీ' రూపకల్పన పై జులై 27న ప్రభుత్వ సమావేశం
- July 19, 2016
తెలంగాణ ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) రూపకల్పన గురించి తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. ఈ మేరకు ఎన్నారై సంఘాలు, ఎన్నారైలతో జులై 27 న మద్యాహ్నం 2గంటలకు హైదరాబాద్, బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రక్కనగల బాలయోగి పర్యాటక్ భవన్ లోని హరిత ప్లాజలో సమావేశం నిర్వహిచనున్నట్లు ఎన్నారై శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు.
జులై 16 జరపాలనుకున్న సమావేశానికి తక్కువ సమయం ఉండడంతో, పలు ఎన్నారై సంఘాలు కొంత గడువు కోరడంతో 27న నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వచ్చే సంఘాల ప్రతినిధులు ఎన్నారై పాలసీ కోసం సూచించాల్సిన సలహాలు, సమాచారాన్ని లిఖిత పూర్వంగా ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని మంత్రి కోరారు.
సమావేశానికి హజరు కాలేని వారు [email protected] ఈ మెయిల్ చేయాలని కోరారు. మరింత సమాచారం కోసం +91 40 2345 0455 పోన్ నంబర్ కు సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







