'తెలంగాణ ఎన్నారై పాలసీ' రూపకల్పన పై జులై 27న ప్రభుత్వ సమావేశం
- July 19, 2016
తెలంగాణ ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) రూపకల్పన గురించి తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. ఈ మేరకు ఎన్నారై సంఘాలు, ఎన్నారైలతో జులై 27 న మద్యాహ్నం 2గంటలకు హైదరాబాద్, బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రక్కనగల బాలయోగి పర్యాటక్ భవన్ లోని హరిత ప్లాజలో సమావేశం నిర్వహిచనున్నట్లు ఎన్నారై శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు.
జులై 16 జరపాలనుకున్న సమావేశానికి తక్కువ సమయం ఉండడంతో, పలు ఎన్నారై సంఘాలు కొంత గడువు కోరడంతో 27న నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వచ్చే సంఘాల ప్రతినిధులు ఎన్నారై పాలసీ కోసం సూచించాల్సిన సలహాలు, సమాచారాన్ని లిఖిత పూర్వంగా ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని మంత్రి కోరారు.
సమావేశానికి హజరు కాలేని వారు [email protected] ఈ మెయిల్ చేయాలని కోరారు. మరింత సమాచారం కోసం +91 40 2345 0455 పోన్ నంబర్ కు సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







