తైవాన్ లో బస్సు దగ్ధం, 26 మంది పర్యాటకులు సజీవ దహనం

- July 19, 2016 , by Maagulf
తైవాన్ లో బస్సు దగ్ధం, 26 మంది పర్యాటకులు సజీవ దహనం

బస్సులో బయలుదేరిన వారంతా కొద్ది సేపట్లో విమానాశ్రయానికి చేరుకునేవారు.. ఒకటి రెండు గంటల్లో ఎవరింటికి వారు వెళ్లిపోయేవారు. కానీ వారిని అగ్ని.. గండంలా చుట్టుముట్టింది. డ్రైవర్ సహా 26 మంది ప్రయాణికులను దహించివేసింది. ఫసిపిక్ ద్వీప దేశం తైవాన్ లో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైవే మీదుగా తాయుయాన్ విమానాశ్రయానికి వెళుతోన్న టూరిస్ట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కనీసం డోర్లు తెరిచేంత అవకాశం లేకుండా అగ్ని కీలలు బస్సును చుట్టుముట్టాయి.ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అరగంట తర్వాతగానీ మంటలను పూర్తిగా అదుపుచేయలేకపోయారు. పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రవేశద్వారం వద్ద మృతదేహాలు కుప్పలుగా పడిఉండటాన్ని బట్టి.. వారంతా బయటికి వచ్చే ప్రయత్నం చేసుంటారనే నిర్ధారణకు వచ్చినట్లు పోలీస్ క్లూస్ టీమ్ సభ్యులు చెప్పారు. చనిపోయిన వారిలో 16 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారని, వీరంతా చైనాకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగటానికి ముందు బస్సు రోడ్డుకు ఒక పక్కగా వెళ్లిందని, అలా ఎందుకు వెళ్లిందీ, మంటలు ఎలా చెలరేగిందీ ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com