సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- September 11, 2025
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాతో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ షేక్ హోముద్ ముబారక్ అల్-హోముద్ అల్-జాబర్ అల్-సబా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పౌర విమానయాన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
వీటితోపాటు, ఆసక్తి ఉన్న రంగాలపై చర్చలు జరిపినట్లు ఒక ప్రకటనలో షేక్ హోముద్ అల్-సబా తెలిపారు. ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారాన్ని విస్తరించే అవకాశాలపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. పౌర విమానయానంలో కువైట్తో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







