మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- September 11, 2025
దుబాయ్: పెట్టుబడిదారుల రాకతో దుబాయ్.. లండన్, పారిస్ మరియు మిలన్ తర్వాత మధ్యప్రాచ్యంలో నాల్గవ-సంపన్న నగరంగా నిలిచింది. యూరప్, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా (EMEA)లో నాల్గవ స్థానంలో నిలిచింది. ది రైజ్ ఆఫ్ దుబాయ్ అధ్యయనం ప్రకారం.. జూన్ 2025 చివరి నాటికి దుబాయ్ 86 వేల మంది మిలియనీర్లు, 251 మంది సెంటీ-మిలియనీర్లు, 23 మంది బిలియనీర్లకు నిలయంగా ఉంది.
ప్రస్తుత వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే, 2040 నాటికి దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా అవతరిస్తుందని న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధనా అధిపతి ఆండ్రూ అమోయిల్స్ అన్నారు.
ఇక మొదటి స్థానంలో ఉన్న లండన్ 2 లక్షల 12వేల మంది మిలియనీర్లకు నిలయంగా ఉండగా, పారిస్ 1 లక్ష 63వేల మందితో రెండవ స్థానంలో.. మిలన్ 1 లక్ష 21వేల మందితో మూడవ స్థానంలో ఉంది.
దుబాయ్ సాంప్రదాయ మార్కెట్లతోపాటు కొత్త పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని స్టీవార్డ్స్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ CEO బిలాల్ ఆడమ్ అన్నారు. తక్కువ పన్నులు, అత్యంత వైవిధ్యభరితమైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, బలమైన ఎయిర్ కనెక్టివిటీ, బలమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫస్ట్-క్లాస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, మంచి అంతర్జాతీయ స్కూల్స్, ఏడాది పొడవునా టూరిజం కార్యకలాపాల కారణంగా దుబాయ్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ నగరంగా ప్రత్యేకతను నిలుపుకుంటుందన్నారు.
తాజా వార్తలు
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు







