ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!

- September 12, 2025 , by Maagulf
ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!

మనామా: ట్రాఫిక్ ప్రమాదం జరిగిన తొమ్మిది సంవత్సరాల తర్వాత, బహ్రెయిన్ పౌరుడి నుండి దాదాపు BD2,500 కోరుతూ బీమా కంపెనీ దాఖలు చేసిన దావాను హై కమర్షియల్ అప్పీల్స్ కోర్టు తిరస్కరించిందని న్యాయవాది అబ్దులాధీమ్ హుబైల్ తెలిపారు.

ఈ కేసు 2015 లో జరిగింది. సిటిజన్ బీమా ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది. దెబ్బతిన్న వాహన మరమ్మతుల కోసం బీమా సంస్థ BD2,481 చెల్లించింది. అయితే, ఇన్సూరెన్స్ నిబంధనలను ఇన్సూర్ వెహికల్ ఉల్లంఘించిందని అనంతరం నిర్వహించిన విచారణలో గుర్తించిన కంపెనీ, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టులో దావా వేసింది.కేసును విచారించిన ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు మొదట కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.  ఇన్సూర్ పర్సన్ పొందిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com