30 బిలియన్ దిర్హామ్లతో డిజర్ట్ రోజ్ సిటీ
- July 19, 2016
దుబాయ్ మునిసిపాలిటీ ఎకో ఫ్రెండ్లీ డిజర్ట్ రోజ్ సిటీ ప్రాజెక్ట్కి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొంది. అల్ రువయ్యా ప్రాంతంలో ఈ సిటీ నిర్మితం కానుంది. 40 శాతం ఎలక్ట్రిసిటీని, అలాగే 40,000 క్యూబిక్ మీటర్స్ నీటినీ ఈ సిటీలో ఉండేవారికి అందించేలా ప్రాజెక్ట్ని రూపొందించారు. డిజర్ట్ రోజ్ షేప్లో డిజైన్ చేయబడ్డ ఈ సిటీ నిర్మాణం ప్రపంచంలోనే అత్యద్భుతంగా ఉండబోతోందని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా చెప్పారు. స్కూల్స్, షాపింగ్ సెంటర్స్, క్లినిక్స్, హాస్పిటల్స్, మసీదులు, పోలీస్ స్టేషన్ సహా పలు సౌకర్యాలు ఈ సిటీలో ఉంటాయి. సుమారు 30 బిలియన్ దిర్హామ్ల ఖర్చుతో 4,000 హెక్టార్లలో రూపొందించనున్న ఈ ప్రాజెక్ట్లో 30,000 ఇళ్ళుంటాయి. ఇందులో 20,000 ఇళ్ళు ఎమిరేటీలకు, మిగిలిన 10,000 వలసదారులకోసం కేటాయిస్తారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









