ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- September 15, 2025
కువైట్: ఆషెల్ ఫర్ కంపెనీస్ మరియు ఆషెల్ ఫర్ బ్యాంక్స్ ప్లాట్ఫామ్ల ద్వారా కార్మికుల వేతనాలను బదిలీ చేయడం గురించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) బ్యాంకుల సమాఖ్యతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మ్యాన్ పవర్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమి అధ్యక్షత వహించారు. కార్మికుల హక్కులను కాపాడటానికి అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా, యజమాని ఫైళ్లను బ్యాంకులకు సమర్పించడానికి సమగ్ర సాంకేతిక ప్రక్రియపై చర్చించారు. బ్యాంకింగ్ ప్రతినిధులు సాంకేతిక సవాళ్లపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అడ్డంకులను అధిగమించడానికి సమన్వయంతో పనిచేయాలని అథారిటీ తెలిపింది. ఎలక్ట్రానిక్ సాలరీ బదిలీ నిబంధనలను పాటించని యజమానుల లావాదేవీలను నిలిపివేయడం వంటి కఠినమైన చర్యలను బ్యాంకులు త్వరలో అమలు చేస్తాయని అల్-ఒసైమి హెచ్చరించారు. కార్మికుల హక్కులను రక్షించడంలో.. న్యాయమైన, పారదర్శకమైన కార్మిక వాతావరణాన్ని పెంపొందించడంలో ఈ చర్య కీలకంగా పనిచేస్తుందన్నారు. ఆమోదించబడిన విధానాలకు అనుగుణంగా బ్యాంకుల ద్వారా ప్రత్యేకంగా సాలరీ ఫైళ్లను సమర్పించాలని అథారిటీ యజమానులను కోరింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







