ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- September 15, 2025
యూఏఈ: సోషల్ మీడియా మరియు గేమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న 8 మంది వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చి, జైలుశిక్ష విధించింది. అబుదాబి క్రిమినల్ కోర్టు దోషులకు మూడు నుండి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష తోపాటు వన్ మిలియన్ దిర్హామ్ల వరకు జరిమానా విధించింది. నిందితులు నేరం చేయడానికి ఉపయోగించిన పరికరాలను సీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే, దోషులు ఇంటర్నెట్ను యాక్సెస్ చేయకుండా కోర్టు నిషేధించింది. దోషుల సంబంధిత ఆన్లైన్ అకౌంట్లను మూసివేయాలని ఆదేశించింది. నిందితుల్లో ముగ్గురిని వారి జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు స్పష్టం చేసింది.
అబుదాబిలోని అధికారులు అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు, మైనర్లపై ఆన్లైన్లో లైంగిక వేధింపుల కేసులను పర్యవేక్షించారు. విస్తృత దర్యాప్తు తర్వాత, అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యయని, నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా, నిందితులకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషించగా అందులో పిల్లలకు సంబంధించిన అశ్లీల కంటెంట్ ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
కోర్టు తీర్పు సందర్భంగా అబుదాబి పబ్లిక్ ప్రాసిక్యూషన్, తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని, సోషల్ మీడియా లేదా గేమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా తెలియని వ్యక్తుల నుండి స్నేహితుల అభ్యర్థనలను అంగీకరించవద్దని, కలిగే ప్రమాదాల గురించి అవగాహన పెంచాలని మరియు బ్లాక్మెయిల్ బాధితులైతే ఎలా స్పందించాలో వారికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







