హత్యకు గురైన భారత కార్మికుని మృతదేహం నేడు స్వదేశానికి
- July 19, 2016
మస్క్యాట్: ఒక ఆహార ఉత్పత్తుల పంపిణీదారుని వద్ద రోజువారీ సేకరణ ఏజెంట్ గా జీవనం కొనసాగిస్తూ గతవారం ముత్తరహ్ సమీపంలో గొంతు కోయబడి దారుణ హత్యకు గురయ్యిన సత్యన్ కేశవన్ ( 50 ) విషాద ఉదంతం పాఠకులకు విదితమే. కాగా ఆయన మృతదేహాన్ని బంధువులు స్నేహితులు మంగళవారం భారతదేశంకు పంపించారు.
మేము సత్యన్ కేశవన్ స్వస్థలమైన కేరళ రాష్ట్రం లోని త్రివేండ్రంకు ఆయన పార్థివ దేహంని పంపడానికి అన్ని విధానాలు పూర్తి చేశామని, బుధవారం రాత్రి స్వదేశానికి చేరుకొంటుందని ఒక అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ "కు చెప్పారు. గత వారం మంగళవారం ముత్తరహ్ లోని తన అపార్ట్మెంట్ లో దారుణ హత్యకు గురైన 50 ఏళ్ల సత్యన్ కేశవన్ సత్యన్ ఒక ఆహార ఉత్పత్తుల పంపిణీదారుని వద్ద రోజువారీ సేకరణ ఏజెంట్ గా జీవనం కొనసాగిస్తున్నాడు.15 వేల రియాల్ ఓమాన్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును సేకరిస్తారు. మరణించిన సత్యన్ గత 30 సంవత్సరాలుగా ఒమన్ లో సౌమ్యుడిగా వివాదరహితుడిగా నివసిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
రాయల్ ఒమన్ పోలీసుల ప్రాధమిక పరిశోధనల ప్రకారం ఈ హత్య వెనుక దోపిడీ చేయడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. సత్యన్ కేశవన్ యొక్క ఫ్లాట్ లోని సహచరులైన ఇద్దరు బంగ్లా దేశీయులను ప్రశ్నించి అదుపులోకి తీసుకొని ఆ తరువాత వారిని విడుదల చేశారు. ఒమాన్ లో సత్యన్ కేశవన్ ఆహార వస్తువుల సరఫరా ఔట్ సోర్సింగ్ పిండి మిల్ సంస్థ లో ఫోర్ మాన్ గా పనిచేస్తున్నాడు
పిండి మిల్లులో కొందరు తెలిపిన వివరాల ప్రకారం, సత్యన్ కేశవన్ ను తన కంపెనీ పని నిమిత్తం నగదు సేకరించడానికి నమ్మకస్తుడైన సత్యన్ కేశవన్ ను సంస్థ ఉపయోగిస్తారు. సత్యన్ కేశవన్ కు భార్య ప్రసీద మరియు వారి ఏకైక కుమార్తె స్వాతి ఉన్నారు. ప్రస్తుతం స్వాతి మాస్టర్ టెక్నాలజీ ప్రవేశ పరీక్షల్లో శిక్షణా తరగతులకు హాజరు కావడానికి ఆమె భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ కు వెళ్ళింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







