బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- September 17, 2025
మనామాః బహ్రెయిన్ లో సంచలనం సృష్టించిన సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో 10మందిని దోషులుగా తెలుస్తూ.. ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఒక సంవత్సరం నుండి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించింది. ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి లక్ష బహ్రెయిన్ దినార్ల జరిమానా, మిగిలిన నిందితులకు ఒక్కొక్కరికి 500 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించారు.సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ మరియు లేబర్ ఫండ్ “టామ్కీన్” యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని సమర్పించినందుకు, అలాగే రెండు సంస్థల నుండి రెండు లక్షల ముప్పై వేల బహ్రెయిన్ దినార్ల కంటే ఎక్కువ డబ్బును దుర్వినియోగం చేయడానికి అధికారిక పత్రాలను ఫేక్ చేసినందుకు నిందితులు కోర్టు దోషులుగా నిర్ధారించింది. నిందితులు నకిలీ పత్రాలను సమర్పించి, బీమా దారుల పేర్లలో మార్పులు చేసి ఎలక్ట్రానిక్ వ్యవస్థను తారుమారు చేశారని, తద్వారా వారు సామాజిక బీమా హక్కుల నుండి ప్రయోజనం పొందారని కోర్టు తెలిపింది. ఇలా ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ పెన్షన్లు, సేవ ముగింపు బోనస్లు మరియు వారు పొందలేని వన్-టైమ్ పరిహారాలను క్లెయిమ్ చేసుకుని నిధులను పొందారని తన తీర్పులో కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









