బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- September 17, 2025
మనామాః బహ్రెయిన్ లో సంచలనం సృష్టించిన సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో 10మందిని దోషులుగా తెలుస్తూ.. ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఒక సంవత్సరం నుండి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించింది. ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి లక్ష బహ్రెయిన్ దినార్ల జరిమానా, మిగిలిన నిందితులకు ఒక్కొక్కరికి 500 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించారు.సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ మరియు లేబర్ ఫండ్ “టామ్కీన్” యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని సమర్పించినందుకు, అలాగే రెండు సంస్థల నుండి రెండు లక్షల ముప్పై వేల బహ్రెయిన్ దినార్ల కంటే ఎక్కువ డబ్బును దుర్వినియోగం చేయడానికి అధికారిక పత్రాలను ఫేక్ చేసినందుకు నిందితులు కోర్టు దోషులుగా నిర్ధారించింది. నిందితులు నకిలీ పత్రాలను సమర్పించి, బీమా దారుల పేర్లలో మార్పులు చేసి ఎలక్ట్రానిక్ వ్యవస్థను తారుమారు చేశారని, తద్వారా వారు సామాజిక బీమా హక్కుల నుండి ప్రయోజనం పొందారని కోర్టు తెలిపింది. ఇలా ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ పెన్షన్లు, సేవ ముగింపు బోనస్లు మరియు వారు పొందలేని వన్-టైమ్ పరిహారాలను క్లెయిమ్ చేసుకుని నిధులను పొందారని తన తీర్పులో కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







