ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- September 17, 2025
రియాద్ః ఇజ్రాయెల్ దురాక్రమణ విధానాలను సౌదీ అరేబియా క్యాబినెట్ తీవ్రంగా ఖండించింది. రియాద్లో క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన సౌదీ అరేబియా క్యాబినెట్ సమావేశం జరిగింది. మిడిలీస్టులో ఇజ్రాయెల్ వరుస దాడులను తీవ్రంగా ఖండించింది. ఖతార్ కు సంఘీభావాన్ని ప్రకటించారు. దాని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఉంటుందని తెలిపింది. అత్యవసర అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ సంయుక్త ప్రకటనను స్వాగతించారు. పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పరిష్కారాన్ని ఆమోదిస్తూ ప్రవేశపెట్టిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లి న్యూయార్క్ ప్రకటనను సౌదీ క్యాబినెట్ స్వాగతించింది. సూడాన్లో శాంతి మరియు భద్రత పునరుద్ధరణకు సంబంధించి సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రుల ఉమ్మడి ప్రకటనకు మంత్రివర్గం తన మద్దతును వ్యక్తం చేసింది. ఇది సూడాన్ ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా విషాదాన్ని తొలిగేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. వీటితోపాటు పలు నిర్ణయాలకు సౌదీ క్యాబినెట్ ఆమోదించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్









