ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- September 18, 2025
కువైట్: వరుసగా రెండవ సంవత్సరం, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK) వైస్ చైర్మన్ మరియు గ్రూప్ CEO అయిన ఇసామ్ అల్-సాగర్ కువైట్లో సస్టైనబిలిటీ నాయకుడిగా ఎంపికయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్స్ 2025 జాబితాలో మిడిల్ ఈస్ట్ అంతటా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల రంగంలో ఆరవ స్థానంలో నిలిచారు.
అల్-సాగర్తో పాటు ఫోర్బ్స్ జాబితా మరో ముగ్గురు కువైటీలు స్థానం సంపాదించారు. కువైట్ ప్రాజెక్ట్స్ కంపెనీ హోల్డింగ్ (KIPCO) CEO షేఖా అదానా నాజర్ అల్-సబా, జైన్ గ్రూప్ వైస్ చైర్మన్ మరియు CEO బాదర్ నాజర్ అల్-ఖరాఫీ మరియు ఎజిలిటీ వైస్ చైర్మన్ మరియు CEO తారిక్ అల్-సుల్తాన్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లుగా ఎంపికయ్యారు.
ఈ సంవత్సరం మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్ల జాబితాలో బ్యాంకింగ్, ఆయిల్, యుటిలిటీస్, ఆహారం మరియు వ్యవసాయం, పెట్టుబడి, పునరుత్పాదక ఇంధనం, వ్యర్థాల నిర్వహణతో సహా 15 కీలక రంగాలలోని 126 మంది ఎగ్జిక్యూటివ్ లీడర్లు జాబితాలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో UAE నుంచి 67 మంది, సౌదీ అరేబియా 23 మందితో మరియు ఈజిప్ట్ 12 మందితో వరుసగా నిలిచాయి.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







