ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- September 18, 2025
కువైట్: వరుసగా రెండవ సంవత్సరం, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK) వైస్ చైర్మన్ మరియు గ్రూప్ CEO అయిన ఇసామ్ అల్-సాగర్ కువైట్లో సస్టైనబిలిటీ నాయకుడిగా ఎంపికయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్స్ 2025 జాబితాలో మిడిల్ ఈస్ట్ అంతటా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల రంగంలో ఆరవ స్థానంలో నిలిచారు.
అల్-సాగర్తో పాటు ఫోర్బ్స్ జాబితా మరో ముగ్గురు కువైటీలు స్థానం సంపాదించారు. కువైట్ ప్రాజెక్ట్స్ కంపెనీ హోల్డింగ్ (KIPCO) CEO షేఖా అదానా నాజర్ అల్-సబా, జైన్ గ్రూప్ వైస్ చైర్మన్ మరియు CEO బాదర్ నాజర్ అల్-ఖరాఫీ మరియు ఎజిలిటీ వైస్ చైర్మన్ మరియు CEO తారిక్ అల్-సుల్తాన్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లుగా ఎంపికయ్యారు.
ఈ సంవత్సరం మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్ల జాబితాలో బ్యాంకింగ్, ఆయిల్, యుటిలిటీస్, ఆహారం మరియు వ్యవసాయం, పెట్టుబడి, పునరుత్పాదక ఇంధనం, వ్యర్థాల నిర్వహణతో సహా 15 కీలక రంగాలలోని 126 మంది ఎగ్జిక్యూటివ్ లీడర్లు జాబితాలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో UAE నుంచి 67 మంది, సౌదీ అరేబియా 23 మందితో మరియు ఈజిప్ట్ 12 మందితో వరుసగా నిలిచాయి.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









