దుబాయ్ లో చంద్రబాబు మీట్ & గ్రీట్: డాక్టర్ రవి వేమూరు
- September 19, 2025
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఏడాది అక్టోబర్ 17న దుబాయ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో దుబాయ్ లోని ప్రవాసాంధ్రులు గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఏపీఎన్నార్టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కుమార్ వేమూరు చెప్పారు. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం జరిగే వేదిక ఇంకా ఖరారు కాలేదని, వేదికతోపాటు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలను ఏపీఎన్నార్టీఎస్ బృందం త్వరలోనే వెల్లడించనుందని తెలిపారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాల కోసం ఎదురుచూస్తుండాలని ఆయన కోరారు.
డాక్టర్ రవికుమార్ వేమూరు మార్గదర్శకత్వంలో, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ రవి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









