హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- September 19, 2025
మనామా: మరొక వ్యక్తిపై దాడి చేసి శాశ్వత వైకల్యానికి కారణమైనందుకు 24 ఏళ్ల విద్యార్థిని మొదటి హై క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 50 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. ఈ సంఘటన ఏప్రిల్ 15న జరిగింది. కారు హారన్ మోగించడంపై వివాదం తర్వాత గొడవ జరిగింది.
ఈ క్రమంలో బాధితుడి ముక్కుపై విద్యార్థి బలంగా కొట్టడంతో ఐదు శాతం శాశ్వత వైకల్యం కలిగిందని వైద్య నివేదిక నిర్ధారించింది. ఘర్షణ సమయంలో బాధితుడి కారును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసినందుకు నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది.
కాగా, బాధితుడు ఆపకుండా కారు హారన్ను ఉపయోగించడం వల్ల ఘర్షణ జరిగిందని నిందితుడు పేర్కొన్నాడు. అయితే నిందితుడు సౌక్ వకీఫ్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాడని, దీంతో బాధితుడు హారన్ మోగించాడని సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిర్ధారించారు. నిందితుడు తన వాహనం నుండి దిగి, బాధితుడిని అవమానించి, అతని ముక్కుపై కొట్టాడని, దాని వల్ల రక్తస్రావం జరిగిందని, అనంతరం బాధితుడి కారు అద్దాన్ని ధ్వంసం చేశాడని కోర్టుకు స్థానిక పోలీసు అధికారులు నివేదిక సమర్పించారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









