వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- September 19, 2025
దోహా: ఫిబ్రవరి 1న జరగనున్న వెబ్ సమ్మిట్ ఖతార్ మూడవ ఎడిషన్ ప్రారంభానికి నాలుగు నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 120 కంటే ఎక్కువ దేశాల నుండి సుమారు 30,000 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ఆఫీస్ (GCO) డైరెక్టర్ హెచ్ఇ షేక్ జాసిమ్ బిన్ మన్సూర్ బిన్ జాబోర్ అల్-థాని అధ్యక్షతన ఖతార్లో వెబ్ సమ్మిట్ పర్మనెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ స్థలం, టిక్కెట్లు తదితర అంశాలపై కమిటీ సమీక్షించింది.
దాదాపు 1,500 కంటే ఎక్కువ స్టార్టప్లు, 700 మంది ఇన్వెస్టర్లు, 350 మంది స్పీకర్లు మరియు 600 మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని కమిటీ తెలిపింది. ఇది ఇప్పటివరకు అతిపెద్ద మరియు అత్యంత వైవిధ్యమైన వెబ్ సమ్మిట్ గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









