ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- September 19, 2025
కొరియా: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. బలమైన ఆటతీరుతో క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చిన ఈ తెలుగు తేజం అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది.శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో, వరల్డ్ నెంబర్ వన్ అయిన దక్షిణ కొరియా స్టార్ అన్ సే యంగ్ చేతిలో సింధు, ఓటమిపాలైంది.
ఈ పోరులో సింధు 14-21, 13-21 తేడాతో ఓడిపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది. మ్యాచ్ మొత్తం 38 నిమిషాల్లోనే ముగిసింది. ప్రారంభం నుంచే అన్ సే యంగ్ (An Se Young) ఆధిపత్యం కనబరచగా, సింధు తన ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆటలో ఏ దశలోనూ సింధు బలమైన పోటీ ఇవ్వలేకపోయింది.
యంగ్ చేతిలో సింధుకు ఇది వరుసగా 8వ ఓటమి. ఇప్పటి వరకు ఈ సౌత్ కొరియా ప్లేయర్ పై సింధు ఒక్క సింగిల్స్ మ్యాచ్ గెలవలేదు. ఈ మ్యాచ్లో గెలిచిన అన్ సే యంగ్.. సెమీఫైనల్లో అకనే యమగూచితో తలపడుతోంది.గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్లో సింధు 21-15, 21-15తో ఆరో సీడ్ పోర్న్పవీ చోచువాంగ్ (థాయ్లాండ్)పై గెలిచింది.
14వ ర్యాంకర్ అయిన సింధు ఆరో ర్యాంకర్ను ఓడించడంతో ఫామ్లోకి వచ్చిందని అంతా అనుకున్నారు. కానీ సౌత్ కొరియా ప్లేయర్ ను సింధు ఓడించలేక ఇంటి దారి పట్టింది.భారత డబుల్స్ ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టిలు కూడా ఈ టోర్నీలో క్వార్టర్ఫైనల్స్కు దూసుకెళ్లారు. డబుల్స్లో 8వ సీడ్ సాత్విక్ ద్వయం 21-13, 21-12తో తైపీ జంట సియాంగ్ చీ చియు-వాంగ్ చి లిన్ను ఓడించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!