అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ

- September 21, 2025 , by Maagulf
అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ

హైదరాబాద్: తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మరియు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రసిద్ధ సినీనటుడు అక్కినేని నాగార్జునకు ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఈ మేరకు దత్తాత్రేయ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి నాగార్జునను ఆహ్వానించడం జరిగింది.

దసరా సందర్భంగా సాంప్రదాయ అలయ్ బలయ్
ప్రతి సంవత్సరం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో “అలయ్ బలయ్” అనే సాంప్రదాయ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ వేడుకల్లో రాజకీయ, సాంస్కృతిక, మరియు సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటూ వస్తున్నారు.

మత సామరస్యం, సాంస్కృతిక వారసత్వానికి ప్రాధాన్యం
ఈ కార్యక్రమం ద్వారా దత్తాత్రేయ మత, కుల, రాజకీయ విభేదాలకు అతీతంగా అందరిని ఒక వేదికపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మత సామరస్యాన్ని చాటిచెప్పేలా, భారతీయ సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించడం జరుగుతుంది.

అక్టోబర్ 3న కార్యక్రమం
ఈ సంవత్సరం అలయ్ బలయ్ వేడుకలు అక్టోబర్ 3న జరగనున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ను ఆహ్వానించిన దత్తాత్రేయ, తాజాగా అక్కినేని నాగార్జునకు ఆహ్వానం అందించడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com