H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- September 21, 2025
అమెరికా: అమెరికాలో హెచ్-1బీ వీసా (H1B visa) రుసుము పెంపు: భారతీయుల లోతైన భయాందోళనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే నిర్ణయం అమెరికాలోని హెచ్-1బీ వీసా (H1B visa) దారుల జీవితాలను ఉలికిపారేసింది. హెచ్-1బీ వీసా రుసుమును సుమారు లక్ష డాలర్ల (₹88 లక్షల) స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించడంతో, అమెరికాలోని భారతీయుల మధ్య గందరగోళం నెలకొంది. ఈ కొత్త నిబంధన నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి వస్తోంది.
ఈ నిర్ణయం వల్ల అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం కనిపిస్తోంది. ముఖ్యంగా పండుగల సందర్భంగా భారత్కు రావాలని ప్రణాళికలు వేసుకున్న చాలా మంది భారతీయులు (Indians) తమ ప్రయాణాలను తక్షణమే రద్దు చేసుకున్నారు. అదేవిధంగా, ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ వీసాదారులు, కొత్త నిబంధన అమల్లోకి రాకముందే అమెరికాకు చేరాలని పరుగులు పెడుతున్నారు.
ఈ ఘటన ప్రభావం విమాన టికెట్ల ధరలపై కూడా పడింది. డిమాండ్ విపరీతంగా పెరగడంతో, న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ కు సాధారణంగా ₹40,000 ఉండే ఎకానమీ టికెట్ ధర ₹80,000కు చేరింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోనూ భారీ రద్దీ, ఉత్కంఠ కనిపించింది. ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు గడువులో అమెరికాకు చేరుకోవాలన్న ఉత్కంఠతో గందరగోళంలో ఉన్నారు. ఈ పరిణామాల వల్ల, అమెరికాలోని హెచ్-1బీ వీసాదారులు మరియు భారత్లోని వారి కుటుంబాలు తీవ్రంగా భయాందోళన చెందుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు







