ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- September 21, 2025
దోహా: ఖతార్ లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ అధిపతి, ఇంజినీర్ మొహమ్మద్ ఖలీద్ అల్ షర్షానీ ప్రకటించారు. తార్షీద్ స్మార్ట్ EV ఛార్జింగ్ ప్రోగ్రామ్ కింద గ్రీన్ మొబిలిటీని పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
తార్షీద్ స్మార్ట్ EV ఛార్జింగ్ యాప్ ద్వారా వినియోగదారులు ఛార్జింగ్ స్టేషన్ స్థానాలు, ఛార్జింగ్ హిస్టరీని సులువుగా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం, ఛార్జింగ్ స్టేషన్లు దోహా మరియు ఉత్తర ఖతార్లో విస్తృతంగా ఉన్నాయని, రాబోయే దశల్లో పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతాలలో విస్తరించనున్నట్లు వెల్లడించారు. ప్రజా డిమాండ్ మేరకు ఈవీ మౌలిక సదుపాయాలను విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు