ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- September 26, 2025
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకం గా వ్యవహరించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి లపై ప్రాసిక్యూషన్ అనుమతికి విజిలెన్స్ కమిషన్ సిఫారస్సు చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ అనుమతించాలని ఇప్పటికే ఏసిబి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమ ర్పించింది. ఈనివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్కు అనుమతిచ్చింది. ఈ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కోరింది.
ఈ విషయంపై గవర్నర్ ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఈ రేసు నిర్వహణలో విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించారని దీంతో ప్రభుత్వానికి రూ. 54.88 కోట్ల నష్టం వాటిల్లందంటూ ఏసిబి కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఇప్పటికే కెటిఆర్, పలువురు ఉన్నతాధికారులపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. కాగా, గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఎసిబి అధికారులు సిద్ధమవుతు న్నారు. క్విడ్ ప్రోకో విధానంలో బిఆర్ఎస్ రూ.44కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, హెచ్ ఎండిఎ నిధుల దుర్వినియోగం, ఇ కార్ రేసింగ్ నిర్వహణ ఖర్చు రూ.600 కోట్లకు సంబంధించి పూర్తిఆధారాలతో ఎసిబి ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...









