జైల్లో గ్యాంగ్వార్ 17 మంది ఖైదీల మృతి
- September 26, 2025
అమెరికా: దక్షిణ అమెరికా దేశాల్లో పెరుగుతున్న హింస, గ్యాంగ్వార్, అల్లర్ల వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈక్వెడార్లో గత కొన్నేళ్లుగా జైళ్లలో హింస తీవ్రతరం అవుతోంది. అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్లు జైళ్లలో ఉండటం వల్ల, జైళ్లు తరచుగా హింసకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అల్లర్లు జరిగిన ఈక్వెడార్ జైలులో, గురువారం నాడు మరోసారి భీకరమైన గ్యాంగ్వార్ జరిగింది.
గురువారం నాడు ఈక్వెడార్లోని ఎస్మెరాల్డాస్ ప్రావిన్స్ రాజధానిలోని జైలులో ఈ గ్యాంగ్వార్ చోటుచేసుకుంది. పాత పగలు, శత్రుత్వం కారణంగా రెండు ముఠాలకు చెందిన దుండగుల మధ్య మొదలైన ఘర్షణ కొద్దిసేపటికే కాల్పుల మోతకు దారి తీసింది. రెండు గ్యాంగ్ల దుండగులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా కాల్పులు(firing) జరుపుకున్నారు. ఈ భీకర గ్యాంగ్వార్లో రెండు శత్రు ముఠాలకు చెందిన 17 మంది దుండగులు మరణించారు. పలువురు ఖైదీలు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దుండగులు పొంచి ఉండి మరో ముఠాపై దాడి చేసి, సెల్ తాళాలను దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత బయటి సెల్లో ఉన్న ఖైదీలను లక్ష్యంగా చేసుకుని ఈ హింసాకాండకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జైలు అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఈక్వెడార్ జైళ్లలో భద్రతా లోపాలు, గ్యాంగ్ల ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







