చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- September 28, 2025
మనామా: బహ్రెయిన్ లో ఓ కంపెనీ చట్టవిరుద్ధంగా తొలగించిన ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని హై లేబర్ కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే, గ్రాట్యుటీలు, చట్టబద్ధమైన వడ్డీ, చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు ఉద్యోగులకు BD1,443 నుండి BD7,224 వరకు లభించనుంది. పరిహారంతోపాటు వార్షిక సెలవులు, ముగింపు ప్రయోజనాల కోసం అదనపు మొత్తాలను చెల్లించాలని లేబర్ కోర్టు తీర్పునిచ్చిందని న్యాయవాది మరియం అల్ షేక్ తెలిపారు.
కాగా, తన క్లయింట్లు ఓపెన్-ఎండ్ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారని మరియు బ్రాంచ్ మూసివేత పేరుతో వారిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని పేర్కొన్నారు. అయితే, ఉద్యోగ తొలగింపులకు చట్టబద్ధమైన కారణాన్ని అందించడంలో కంపెనీ విఫలమైందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ 101 ప్రకారం ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని సదరు కంపెనీని లేబర్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!