ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- September 28, 2025
న్యూయార్క్: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కోరారు. లేదంటే ప్రపంచ భద్రతను మరింత అస్థిరపరిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) కింద అత్యవసర పరిస్థితిగా పేర్కొన్న నివేదికను ఉటంకిస్తూ మాట్లాడారు.
ఇజ్రాయెల్ ఆక్రమణలు, గాజా నుంచి బలవంతపు వలసలు, అకారణంగా పౌరులను చంపడం వంటి పద్ధతులను ఆయన ఖండించారు. వీటిని పాలస్తీనియన్ల చారిత్రక, చట్టపరమైన హక్కుల ఉల్లంఘనలుగా అభివర్ణించారు. రెండు దేశాల సిద్ధాంతంలో న్యాయమైన మరియు శాశ్వత శాంతిని సాధించడంలో భద్రతా మండలి, విస్తృత అంతర్జాతీయ కమ్యూనిటీ తమ బాధ్యతలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించే దేశాల సంఖ్య పెరుగుతుండటాన్ని ఆయన స్వాగతించారు. అన్ని దేశాలు దీనిని అనుసరించాలని పిలుపునిచ్చారు.
సౌదీ అరేబియా ప్రిన్స్ ఫైసల్ విజన్ 2030 పనితీరు సూచికలలో 93 శాతం సాధించబడ్డాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి, మహిళలు, యువతకు సాధికారత కల్పించడానికి మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి సంస్కరణలను అమలు చేశారని అన్నారు.
తాజా వార్తలు
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ







