ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- September 28, 2025
న్యూయార్క్: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కోరారు. లేదంటే ప్రపంచ భద్రతను మరింత అస్థిరపరిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) కింద అత్యవసర పరిస్థితిగా పేర్కొన్న నివేదికను ఉటంకిస్తూ మాట్లాడారు.
ఇజ్రాయెల్ ఆక్రమణలు, గాజా నుంచి బలవంతపు వలసలు, అకారణంగా పౌరులను చంపడం వంటి పద్ధతులను ఆయన ఖండించారు. వీటిని పాలస్తీనియన్ల చారిత్రక, చట్టపరమైన హక్కుల ఉల్లంఘనలుగా అభివర్ణించారు. రెండు దేశాల సిద్ధాంతంలో న్యాయమైన మరియు శాశ్వత శాంతిని సాధించడంలో భద్రతా మండలి, విస్తృత అంతర్జాతీయ కమ్యూనిటీ తమ బాధ్యతలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించే దేశాల సంఖ్య పెరుగుతుండటాన్ని ఆయన స్వాగతించారు. అన్ని దేశాలు దీనిని అనుసరించాలని పిలుపునిచ్చారు.
సౌదీ అరేబియా ప్రిన్స్ ఫైసల్ విజన్ 2030 పనితీరు సూచికలలో 93 శాతం సాధించబడ్డాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి, మహిళలు, యువతకు సాధికారత కల్పించడానికి మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి సంస్కరణలను అమలు చేశారని అన్నారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









