చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- September 28, 2025
మనామా: బహ్రెయిన్ లో ఓ కంపెనీ చట్టవిరుద్ధంగా తొలగించిన ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని హై లేబర్ కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే, గ్రాట్యుటీలు, చట్టబద్ధమైన వడ్డీ, చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు ఉద్యోగులకు BD1,443 నుండి BD7,224 వరకు లభించనుంది. పరిహారంతోపాటు వార్షిక సెలవులు, ముగింపు ప్రయోజనాల కోసం అదనపు మొత్తాలను చెల్లించాలని లేబర్ కోర్టు తీర్పునిచ్చిందని న్యాయవాది మరియం అల్ షేక్ తెలిపారు.
కాగా, తన క్లయింట్లు ఓపెన్-ఎండ్ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారని మరియు బ్రాంచ్ మూసివేత పేరుతో వారిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని పేర్కొన్నారు. అయితే, ఉద్యోగ తొలగింపులకు చట్టబద్ధమైన కారణాన్ని అందించడంలో కంపెనీ విఫలమైందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ 101 ప్రకారం ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని సదరు కంపెనీని లేబర్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







