చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- September 28, 2025
మనామా: బహ్రెయిన్ లో ఓ కంపెనీ చట్టవిరుద్ధంగా తొలగించిన ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని హై లేబర్ కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే, గ్రాట్యుటీలు, చట్టబద్ధమైన వడ్డీ, చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు ఉద్యోగులకు BD1,443 నుండి BD7,224 వరకు లభించనుంది. పరిహారంతోపాటు వార్షిక సెలవులు, ముగింపు ప్రయోజనాల కోసం అదనపు మొత్తాలను చెల్లించాలని లేబర్ కోర్టు తీర్పునిచ్చిందని న్యాయవాది మరియం అల్ షేక్ తెలిపారు.
కాగా, తన క్లయింట్లు ఓపెన్-ఎండ్ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారని మరియు బ్రాంచ్ మూసివేత పేరుతో వారిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని పేర్కొన్నారు. అయితే, ఉద్యోగ తొలగింపులకు చట్టబద్ధమైన కారణాన్ని అందించడంలో కంపెనీ విఫలమైందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ 101 ప్రకారం ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని సదరు కంపెనీని లేబర్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









