చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- September 28, 2025
మనామా: బహ్రెయిన్ లో ఓ కంపెనీ చట్టవిరుద్ధంగా తొలగించిన ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని హై లేబర్ కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే, గ్రాట్యుటీలు, చట్టబద్ధమైన వడ్డీ, చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు ఉద్యోగులకు BD1,443 నుండి BD7,224 వరకు లభించనుంది. పరిహారంతోపాటు వార్షిక సెలవులు, ముగింపు ప్రయోజనాల కోసం అదనపు మొత్తాలను చెల్లించాలని లేబర్ కోర్టు తీర్పునిచ్చిందని న్యాయవాది మరియం అల్ షేక్ తెలిపారు.
కాగా, తన క్లయింట్లు ఓపెన్-ఎండ్ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారని మరియు బ్రాంచ్ మూసివేత పేరుతో వారిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని పేర్కొన్నారు. అయితే, ఉద్యోగ తొలగింపులకు చట్టబద్ధమైన కారణాన్ని అందించడంలో కంపెనీ విఫలమైందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ 101 ప్రకారం ఉద్యోగులకు పరిహారం చెల్లించాలని సదరు కంపెనీని లేబర్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







