సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- September 28, 2025
దోహా: సాయుధ పోరాటాలలో పిల్లలను రక్షించడానికి ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని ఖతార్ విద్యా మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని దోహాలోని UN సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి కార్యాలయం నిర్వహించింది. మొదటి దశ సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన 60 పాఠశాలల భాగస్వామ్యంతో సెప్టెంబర్ 24న ఉపాధ్యాయులకు వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో 30 ప్రభుత్వ పాఠశాలలు, 30 ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారు. వాటిలో యునెస్కో-అనుబంధ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా 4 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం రూపొందించగా, ఖతార్లో దాని మొదటి దశ 10 మరియు 15 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులపై ఫోకస్ చేయనుంది. ఓరిగామి శాంతి పక్షులను తయారు చేయడాన్ని విద్యార్థులకు నేర్పించనున్నారు. ఇలా తయారు చేసిన వాటిని 2026లో దోహాలో మరియు న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సహా అంతర్జాతీయ కళా ప్రదర్శనలలో ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







