సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- September 28, 2025
దోహా: సాయుధ పోరాటాలలో పిల్లలను రక్షించడానికి ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని ఖతార్ విద్యా మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని దోహాలోని UN సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి కార్యాలయం నిర్వహించింది. మొదటి దశ సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన 60 పాఠశాలల భాగస్వామ్యంతో సెప్టెంబర్ 24న ఉపాధ్యాయులకు వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో 30 ప్రభుత్వ పాఠశాలలు, 30 ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారు. వాటిలో యునెస్కో-అనుబంధ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా 4 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం రూపొందించగా, ఖతార్లో దాని మొదటి దశ 10 మరియు 15 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులపై ఫోకస్ చేయనుంది. ఓరిగామి శాంతి పక్షులను తయారు చేయడాన్ని విద్యార్థులకు నేర్పించనున్నారు. ఇలా తయారు చేసిన వాటిని 2026లో దోహాలో మరియు న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సహా అంతర్జాతీయ కళా ప్రదర్శనలలో ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







