ఆసియా కప్ విజేతగా భారత్

- September 29, 2025 , by Maagulf
ఆసియా కప్ విజేతగా భారత్

ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్స్ లో పాకిస్తాన్ పై భారత్ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో పాక్ ను చిత్తు చేసింది. 5 వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల టార్గెట్ ను భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ముఖ్యంగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఒంటి చేత్తో భారత్ కు విజయాన్ని అందించాడు. 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. చివరి వరకు క్రీజులో ఉండి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com