ఆసియా కప్ విజేతగా భారత్
- September 29, 2025
ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్స్ లో పాకిస్తాన్ పై భారత్ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో పాక్ ను చిత్తు చేసింది. 5 వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల టార్గెట్ ను భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ముఖ్యంగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఒంటి చేత్తో భారత్ కు విజయాన్ని అందించాడు. 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. చివరి వరకు క్రీజులో ఉండి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









