టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- September 29, 2025
న్యూ ఢిల్లీ: ఆసియా కప్ 2025 లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో టీమిండియా మరొకసారి తన విజయ పతాకం ఎగురవేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఈ కీలక పోరులో భారత్ 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలోనూ, సూపర్-4లోనూ పాక్ను ఓడించిన టీమిండియా ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ విజయంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా స్పందించారు. టీమిండియా ఆటగాళ్ల పోరాట స్పూర్తిని కొనియాడుతూ ఆయన ట్వీట్ చేశారు. క్రీడా మైదానంలో భారత జట్టు చూపిన కట్టుదిట్టమైన ఆట, క్రమశిక్షణ, జట్టు స్పూర్తి ఆయనను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంలో ఆయన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆపరేషన్ తిలక్ అనే అర్థం వచ్చేలా ట్వీట్లో పేర్కొన్నారు.’క్రీడా మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్.. ఫలితం మాత్రం మారలేదు. భారత్దే గెలుపు. మన క్రికెటర్లకు అభినందనలు’అని మోదీ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







