కబాలి టికెట్స్ కావాలంటూ మినిస్టర్ నుండి రికమండేషన్ లెటర్..
- July 21, 2016
కబాలి మానియా ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఈ సినిమా కోసం వేలాది మంది అభిమానులు పలు ప్రాంతాలలోని థియేటర్ల దగ్గర బారులు తీరారు. కొన్ని ప్రాంతాలు అయితే కబాలి సునామీలో కొట్టుకుపోయేలా ఉన్నాయి. మరి ఇంతగా వ్యాపించిన కబాలి ఫీవర్ సామాన్యులకే కాదు సినీ సెలబ్స్, రాజకీయ నాయకులకు కూడా సోకింది. తమకు టికెట్స్ కావాలంటూ థియేటర్ యాజమాన్యాలకు రికమండేషన్ లెటర్స్ వెళుతున్నాయి. ఒక వైపు ఫ్యాన్స్ ఒత్తిడి, మరో వైపు రికమండేషన్ లెటర్స్ థియేటర్ యాజమాన్యులకు గుదిబండగా మారాయి. తాజాగా తమిళనాడుకి చెందిన ఇన్ఫర్మేషన్ మరియు పబ్లిసిటీ మంత్రి తనకు పది టిక్కెట్స్ కావాలని అభిరామి థియేటర్ మేనేజర్ కి ఓ రికమండేషన్ లెటర్ రాశారు. విడుదల రోజు మొదటిషోకు ఆ 10 టికెట్స్ కావాలని తన లెటర్ లో పేర్కొన్నాడు. గతంలో ఎన్నడు లేని విధంగా రజినీకాంత్ చిత్రంపై అభిమానులు ఇంతటి ఆదరణ చూపిస్తుండడంతో చిత్ర యూనిట్తో పాటు తలైవా కూడా ఫుల్ ఖుషీలో ఉండి ఉంటారని చెబుతున్నారు. చిన్న పిల్లలకు కూడా కబాలి వైరల్ లా సోకడంతో, ఆయన స్టైల్ లో ఆడిపాడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







