మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- October 07, 2025
మచిలీపట్నం: పార్లమెంట్ సభ్యునిగా, లోక్ సభ సభార్ది నెట్ లేజీశ్లేషన్ చైర్మన్ గా మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంపీ బాలశౌరి మంగళగిరి లోని ఎయిమ్స్ అభివృద్ధి కోసం మరో ముందడుగు వేశారు.ఎయిమ్స్ పాలక మండలి సభ్యునిగా ఇటీవలే నియమింప బడిన ఎంపీ బాలశౌరి ఎయిమ్స్ ప్రగతి కొరకు తన దైన శైలిలో ముందుకు వెళుతున్నారు.
పోయిన నెలలో జరిగిన మంగళగిరి ఎయిమ్స్ పాలక వర్గ సమావేశములో పాల్గొన్న ఎంపీ బాలశౌరి అక్కడకు వైద్యం కోసం వచ్చే వారికోసం మరిన్ని సదుపాయలు కల్పించాలని, ఎయిమ్స్ నేషనల్ హై వే పక్కనే ఉన్నందున రోడ్డు ప్రమాద భాదితులను ఆదుకోవడం కోసం ఒక స్వతంత్ర ట్రామా విభాగం, రీసెర్చ్ వసతులతో కూడిన క్యాన్సర్ సెంటర్ మరియు క్రిటికల్ కేర్ విభాగాలు నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ఎంపీ బాలశౌరి లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే మంగళగిరి ఎయిమ్స్ నందు ఎంపీ గారు కోరినట్లుగా ఒక ట్రామా విభాగం, రీసెర్చ్ వసతులతో కూడిన క్యాన్సర్ విభాగం మరియు క్రిటికల్ కేర్ విభాగాలను వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రధానమంత్రి స్వాత్స్య సురక్ష యోజన (PMSSY) కింద మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
లేఖపై వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి,ఈ విషయంలో సహకారం అందించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









