ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- October 07, 2025
హైదరాబాద్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉచిత పథకాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్న ఏపీ, తెలంగాణ,కర్ణాటక ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. ఉచిత పథకాల కోసం ప్రభుత్వాలు భారీగా అప్పులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం పేరుతో అప్పుల్లో కూరుకుపోతే రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాలకు సూచించారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలకు తాత్కాలిక లాభం కలిగించినా, దీర్ఘకాలంలో అది ఆర్థిక భారం అవుతుందని అన్నారు. “చేపలు ఇచ్చే బదులు చేపలు పట్టడం నేర్పించాలి” అంటూ వెంకయ్య నాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అలాగే రాజకీయ నాయకుల ప్రవర్తనపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలలో బూతులు తిట్టడం సిగ్గుచేటు అని, ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీలు మారే ప్రజా ప్రతినిధులు ముందుగా రాజీనామా చేయాలన్నారు. క్రిమినల్ కేసుల్లో ఉన్న నాయకులపై విచారణ త్వరగా పూర్తయ్యేలా చూడాలని కూడా కోరారు. రాజకీయ వారసత్వాలకు తాను వ్యతిరేకమని, అందుకే తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురాలేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







