ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- October 08, 2025
మస్కట్: బెలారస్ లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ రెండు రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తో పలు రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇది దోహదం చేస్తాయని ప్రకటించారు. ఉమ్మడి పారిశ్రామిక సహకార ప్రాజెక్టులు ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల వృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని వారు తెలిపారు.
ఉమ్మడి ఆసక్తి ఉన్న కొన్ని అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. ఆహార భద్రత, వ్యవసాయం, పరిశ్రమ, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం మరియు సంస్కృతి రంగాలలో ఉన్నత స్థాయి పరస్పర సందర్శనల సమయంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో సాధించిన పురోగతిపై ఇద్దరు నాయకులు చర్చించారు. వ్యవసాయం, సమాచార సాంకేతిక రంగం, ఫర్నిచర్ మరియు పల్ప్ మరియు కాగితం ఉత్పత్తిలో రెండు దేశాల మధ్య పెట్టుబడులను విస్తరించడానికి వారు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కృతజ్ఞతలు తెలిపారు. బెలారస్ అధ్యక్షుడిని ఒమన్ సందర్శించమని ఆహ్వానించారు.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







