బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!

- October 09, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!

మనామా: బహ్రెయిన్‌లోని వలస కార్మికుల రక్షణ సంఘం (MWPS) డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్‌గా మోనా యూసుఫ్ ఖలీల్ అల్మోయ్యద్ ఎన్నికయ్యారు. న్యాయవాది మాధవన్ కల్లాత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆఫీస్ బేరర్ల జాబితా ప్రకారం.. చైర్‌పర్సన్ గా మోనా యూసుఫ్ ఖలీల్ అల్మోయ్యద్; వైస్ చైర్‌పర్సన్ గా ఎవోన్ విజయవాణి భాస్కరన్; ప్రధాన కార్యదర్శి గా మాధవన్ కల్లాత్; కోశాధికారిగా కవితశ్రీ సువర్ణ; అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ గా మొహమ్మద్ గయాసుల్లా అమానుల్లా మరియు అసిస్టెంట్ కోశాధికారి గా డేనియల్ మెనెజెస్ అంబ్రోసియో ఎన్నికయ్యారు.

సంస్థల లక్ష్యాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు బోర్డు ఐదు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అయుక్ అర్రే నదుమ్నే ఆధ్వర్యంలో యాక్షన్ కమిటీ, కవితశ్రీ సువర్ణ  హెడ్ గా ఫైనాన్స్ కమిటీ, మహమ్మద్ గయాస్ ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కమిటీ, జుహైర్ కతీబ్  నేతృత్వంలో లేబర్ సేఫ్టీ & వెల్ఫేర్ కమిటీ మరియు రాజి ఉన్నికృష్ణన్ ఆధ్వర్యంలో మీడియా & పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com