బహరేన్ లో బాంబు దాడులు జరిపేందుకు ప్రణాళికలను రచించిన అయిదుగురి అరెస్ట్
- July 22, 2016
దేశంలో అనేక బాంబు దాడులు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్న ఐదుగురు బహ్రేయినీ అనుమానితుల ప్రయత్నాలను సెక్యూరిటీ అధికారులు భగ్నం చేసారు. వారు బాంబులని తయారీ చేసి మరియు పేలుడు పదార్ధాలని నిల్వ చేయడంతో ఇటీవల వారిని అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. విద్యార్థుల సమూహంగా ఉన్న ఒక గుంపు ఇరాన్ మరియు ఇరాక్ లో సైనిక శిక్షణ పొందారు.హమద్ టౌన్ లో ఒక ఆటో-సేవ గారేజ్ నుండి ఆయుధాలు, పేలుడు, బాంబు సంపాదించే పదార్థాలని అనుమానితుల ద్వారా ఒక గిడ్డంగి వాడబడిందని పెద్ద సంఖ్యలో ఉన్న వాటిని పోలీసులు జప్తు చేసినట్లు ప్రకటించింది. వారి వద్ద నుంచి మరిన్నీ ఆయుధాలని వారి నివాసాల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోనికి తీసుకొన్న అనుమానితులు వరుసగా మహమ్మద్ అబ్దుల్జాళిల్ (28), మహమూద్ జస్సిమ్ (26), జస్సిమ్ మన్సూర్ (25) అహ్మద్ మహ్మద్ (23) మరియు ఖలిల్ హసన్ (20) గా ఉన్నట్లు గుర్తించారు.
అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క ప్రకటన ప్రకారం, ఈ ఆపరేషన్ తీవ్రవాద నిరోధక కార్యక్రమ ఫలితంగా వచ్చిందన్నారు. " తీవ్రవాద ఆరోపణలపై ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. బాంబు తయారు పదార్థాలు మరియు ఆయుధాలు స్వాధీనం చేసుకొని అనుమానితుల నుండి దాడుల సమాచారం రాబట్టగా వారు బహరేన్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాలలో పేలుళ్ల జరపాలని యోచన చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







