కెపిటల్ గవర్నరేట్లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- October 19, 2025
కువైట్: భద్రతాను బలోపేతం చేయడానికి మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్ కెపిటల్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో అవేర్ నెస్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. మొబైల్ టీమ్స్ ద్వారా నిర్వహించిన ఈ ఆపరేషన్.. రోడ్లపై ప్రజల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డైరెక్టరేట్ ప్రకారం ఈ క్యాంపెయిన్ సందర్భంగా 519 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే, ఇద్దరు వాంటెడ్ వ్యక్తుల అరెస్టు చేయగా, మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఇద్దరిని, నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అన్ని గవర్నరేట్లలో 24 గంటలూ ఇటువంటి అవేర్ నెస్ క్యాంపెయిన్ లు కొనసాగుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







