కెపిటల్ గవర్నరేట్లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- October 19, 2025
కువైట్: భద్రతాను బలోపేతం చేయడానికి మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్ కెపిటల్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో అవేర్ నెస్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. మొబైల్ టీమ్స్ ద్వారా నిర్వహించిన ఈ ఆపరేషన్.. రోడ్లపై ప్రజల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డైరెక్టరేట్ ప్రకారం ఈ క్యాంపెయిన్ సందర్భంగా 519 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే, ఇద్దరు వాంటెడ్ వ్యక్తుల అరెస్టు చేయగా, మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఇద్దరిని, నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అన్ని గవర్నరేట్లలో 24 గంటలూ ఇటువంటి అవేర్ నెస్ క్యాంపెయిన్ లు కొనసాగుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







