విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- January 22, 2026
చెన్నై: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK), కమలహాసన్ నాయకత్వంలోని మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఎన్నికల గుర్తులను కేటాయించింది. విజయ్ పార్టీకి ‘విజిల్’ గుర్తు లభించగా, కమల్ పార్టీకి ‘బ్యాటరీ టార్చ్’ గుర్తును ఖరారు చేసింది.
మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ పార్టీకి ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే గుర్తుతో పోటీ చేయాలన్న పార్టీ అభ్యర్థనను ఈసీ ఆమోదించింది. అవినీతి, అక్రమ పాలనపై ప్రజలను చైతన్యపరచడమే తమ లక్ష్యమని చెబుతున్న టీవీకేకు విజిల్ గుర్తు ప్రతీకగా నిలవనుంది. యువతలో ఇప్పటికే ఉన్న విజయ్ క్రేజ్ను ఓట్లుగా మలచుకోవడంలో ఈ గుర్తు కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, కమలహాసన్ పార్టీ మక్కల్ నీది (Vijay TVK party) మయ్యంకు గత ఎన్నికల్లో వాడిన బ్యాటరీ టార్చ్ గుర్తునే కొనసాగించారు. ఓటర్లకు సులభంగా గుర్తుండేందుకు, పార్టీ గుర్తింపును బలోపేతం చేసేందుకు పాత గుర్తే కావాలని ఎంఎన్ఎం చేసిన విజ్ఞప్తిని ఈసీ మన్నించింది. గత ఎన్నికల్లో సీట్లు దక్కకపోయినా, ఈసారి బలమైన ప్రచారంతో తమ ఉనికిని చాటాలని కమల్ పార్టీ భావిస్తోంది.
రెండు పార్టీలకు గుర్తులు ఖరారవడంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, పొత్తులపై దృష్టి పెట్టే దశకు రాజకీయాలు చేరాయి. 2026 ఎన్నికల దిశగా ఇది ఒక కీలక మైలురాయిగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







