కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక

- October 25, 2025 , by Maagulf
కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక

వాట్సాప్(WhatsApp Scam) యూజర్లు జాగ్రత్తగా ఉండాలని యాప్ తాజాగా హెచ్చరించింది. కొత్త రకమైన స్కామ్‌లో మోసగాళ్లు యూజర్ల డేటాను దొంగిలించి డబ్బు కాజేస్తున్నారు. ఈ స్కామ్ ముఖ్యంగా వాట్సాప్‌లో(WhatsApp Scam) నమ్మదగిన వ్యక్తుల పేరుతో సందేశాలు పంపడం ద్వారా జరిగిపోతుంది.

స్కామ్ ఇలా జరుగుతుంది:

  • గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్‌లో మెసేజ్ పంపుతారు.
  • మెసేజ్‌లో ఎమర్జెన్సీ లేదా తక్షణ చర్య అవసరమని చెప్పి, బంధువుల లేదా స్నేహితుల పేర్లను వాడి users ను భయపెడతారు.
  • ఆ తర్వాత లింక్ క్లిక్ చేయమని, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయమని, లేక డబ్బు పంపమని అడుగుతారు.
  • యూజర్ ఈ సూచనలు పాటిస్తే, పూర్తి మోసం జరుగుతుంది.

జాగ్రత్తలు మరియు సురక్షితంగా ఉండే మార్గాలు

  • గుర్తు తెలియని వ్యక్తులకు OTP, పాస్‌వర్డ్, PIN వంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దు.
  • వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ను(Two-step verification) ఎనేబుల్ చేయడం ద్వారా అకౌంట్ సురక్షితం చేయండి.
  • అనుమానాస్పద మెసేజ్‌లను వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.
  • మీకు తెలిసిన వ్యక్తి అని అనిపించినా, డబ్బు అవసరమని మెసేజ్ వస్తే కాల్ చేసి నిజంగా చెక్ చేయండి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com