యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- October 25, 2025
యూఏఈ: యూఏఈ పాఠశాలల్లో, ఉపాధ్యాయులు మరియు కౌన్సెలర్లు "క్రమశిక్షణ" అంటే ఏమిటో ఆలోచిస్తున్నారు. విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ఈ విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యార్థి ప్రవర్తన నియమావళిని విడుదల చేసింది. ఇది 46 రకాల ఉల్లంఘనలను మరియు సంబంధిత క్రమశిక్షణా చర్యలను కేటగిరులగా వివరించారు.
భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన కేరళలో పాఠశాలలో అవమానించారని 14 ఏళ్ల యూఏఈ వలసదారుడి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం వివాదానికి దారితీసంది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది.
“పిల్లలు చేసే చిన్న ప్రయత్నాలను కూడా టీచర్లు గుర్తించాలని, తరచూ అంతరాయం కలిగించే విద్యార్థులు ప్రత్యేక దృష్టిని కోరుకుంటారని అంబాసిడర్ స్కూల్ షార్జా ప్రిన్సిపాల్ ఆరోగ్య రెడ్డి తెలిపారు. చిన్న చిన్న అభినందన కూడా విద్యార్థుల్లో ఎంతో ప్రేరణను పెంచుతుందని తెలిపారు. తమ పాఠశాలలో సమస్యలను మొదట కౌన్సెలర్లు పరిష్కరిస్తారని వెల్లడించారు.
సాధారణంగా యూఏఈలోని స్కూల్ పిల్లలు మరింత క్రమశిక్షణతో ఉంటారని, యూఏఈలో ప్రత్యేకమైన లెర్నింగ్ ప్రక్రియలు ఉంటాయని, మంచి వాతావరణంలో పెరుగుతారని షార్జా ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమోద్ మహాజన్ తెలిపారు. అప్పుడప్పుడు దారి తప్పే విద్యార్థుల కోసం, తాము డిగ్రీ 1, డిగ్రీ 2, మొదలైన వాటిని సరిదిద్దే చర్యలను అమలు చేస్తున్నామని వివరించారు. కౌన్సెలర్లు మరియు ఉపాధ్యాయులు CCTV నిఘా, భద్రతా అధికారుల సహాయంతో విద్యార్థులను నిశితంగా పర్యవేక్షిస్తారని ఆయన అన్నారు.
పాఠశాలలోని అంతర్గత IT సెల్ కూడా విద్యార్థుల సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందన్నారు. "విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా పాఠశాల గురించి అనుచితంగా ఏదైనా పోస్ట్ చేయకుండా చూసుకోవడానికి" అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







