అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- October 27, 2025
దోహా: అల్ వక్రా పోర్టులో లంగరు వేసిన అనేక ఫిషింగ్ బోట్లను దహనం చేసిన అగ్నిప్రమాదం కేసులో పురోగతి నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆసియా సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. ఇద్దరు నిందితులు ఒక పడవ నుండి మరొక పడవకు చట్టవిరుద్ధంగా విద్యుత్ లైన్ను కనెక్ట్ చేయడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక, పోరెన్సిక్ విచారణలో తేలిందని వెల్లడించారు. అక్టోబర్ 22న ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకొని, సకాలంలో స్పందించిన ఫైర్ ఫైటర్స్ మంటలను వేగంగా అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!









