అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- October 27, 2025
దోహా: అల్ వక్రా పోర్టులో లంగరు వేసిన అనేక ఫిషింగ్ బోట్లను దహనం చేసిన అగ్నిప్రమాదం కేసులో పురోగతి నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆసియా సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. ఇద్దరు నిందితులు ఒక పడవ నుండి మరొక పడవకు చట్టవిరుద్ధంగా విద్యుత్ లైన్ను కనెక్ట్ చేయడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక, పోరెన్సిక్ విచారణలో తేలిందని వెల్లడించారు. అక్టోబర్ 22న ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకొని, సకాలంలో స్పందించిన ఫైర్ ఫైటర్స్ మంటలను వేగంగా అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









