నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- October 27, 2025
యూఏఈ: నవంబర్ 3న యూఏఈ జెండా దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆరోజున ఉదయం 11 గంటలకు అందరూ జెండాను ఎగురవేయాలని యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌరులు, నివాసితులు మరియు సంస్థలు పాల్గొని, జెండా ఎగురవేయాలని అన్నారు.
అంతకుముందు, దుబాయ్ 'నేషనల్ మంత్ 'ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 2న జెండా దినోత్సవం నుండి ఈద్ అల్ ఎతిహాద్ వరకు యూఏఈ జాతీయ సందర్భాలను ఎమిరేట్ వ్యాప్తంగా జరుపుకోవాలని సూచించింది. ప్రతిసారీ జెండాను ఎగురవేసే ముందు దానిని పరిశీలించాలని సూచించారు. అది దెబ్బతినకుండా, ముడతలు పడకుండా లేదా చిరిగిపోకుండా చూసుకోవాలన్నారు. జెండాను ఎరుపు భాగం పైకి మరియు మిగిలిన మూడు రంగులు క్రిందికి ఉండేలా వీధుల్లో ఎగురువేయాలని సూచించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









