నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- October 27, 2025
యూఏఈ: నవంబర్ 3న యూఏఈ జెండా దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆరోజున ఉదయం 11 గంటలకు అందరూ జెండాను ఎగురవేయాలని యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌరులు, నివాసితులు మరియు సంస్థలు పాల్గొని, జెండా ఎగురవేయాలని అన్నారు.
అంతకుముందు, దుబాయ్ 'నేషనల్ మంత్ 'ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 2న జెండా దినోత్సవం నుండి ఈద్ అల్ ఎతిహాద్ వరకు యూఏఈ జాతీయ సందర్భాలను ఎమిరేట్ వ్యాప్తంగా జరుపుకోవాలని సూచించింది. ప్రతిసారీ జెండాను ఎగురవేసే ముందు దానిని పరిశీలించాలని సూచించారు. అది దెబ్బతినకుండా, ముడతలు పడకుండా లేదా చిరిగిపోకుండా చూసుకోవాలన్నారు. జెండాను ఎరుపు భాగం పైకి మరియు మిగిలిన మూడు రంగులు క్రిందికి ఉండేలా వీధుల్లో ఎగురువేయాలని సూచించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







