సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- October 27, 2025
రియాద్: సౌదీ అరేబియా చమురుయేతర ఎగుమతులు పెరిగాయి. 2024 ఆగస్టు నెలతో పోలిస్తే 2025 ఆగస్టులో 5.5 శాతం పెరుగుదలను నమోదు చేశాయని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) బులెటిన్ తెలిపింది. వాణిజ్య బ్యాలెన్స్ 4.1 శాతం మిగులు వృద్ధిని నమోదు చేసింది. ఇది 24.2 బిలియన్ సౌదీ అరేబియా మొత్తం చమురుయేతర ఎగుమతుల్లో యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాలు 25.4 శాతం వాటాను కలిగి ఉండగా, రసాయన ఉత్పత్తులు 22.7 శాతంతో రెండవ స్థానంలో ఉన్నాయి.
దిగుమతి పరంగా చూస్తే.. యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాలు మొత్తం దిగుమతుల్లో 29.8 శాతం ఉన్నాయి. ఇది గతేడాది కంటే 24.7 శాతం పెరుగుదల నమోదైంది.
మరోవైపు చమురు ఎగుమతులు కూడా 7 శాతం పెరిగాయి. సౌదీ అరేబియా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగుతోంది. మొత్తం ఎగుమతుల్లో 16.2 శాతం మరియు మొత్తం దిగుమతుల్లో 26.4 శాతం వాటాను కలిగి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 11.1 శాతం ఎగుమతులు మరియు 5.4 శాతం దిగుమతులతో రెండవ స్థానంలో ఉండగా, ఇండియా 9.2 శాతం ఎగుమతులతో మూడవ స్థానంలో ఉంది. దమ్మామ్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఓడరేవు దిగుమతులకు ప్రధాన కేంద్రంగా, మొత్తంలో 25.6 శాతం ఎగుమతులు, దిగుమతులు ఇక్కడి నుండే జరిగాయి. ఆ తరువాత జెడ్డా ఇస్లామిక్ ఓడరేవు 21.9 శాతంతో రెండో స్థానంలో ఉందని స్టాటిస్టిక్స్ అథారిటీ బులెటిన్ తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







