సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- October 27, 2025
రియాద్: సౌదీ అరేబియా చమురుయేతర ఎగుమతులు పెరిగాయి. 2024 ఆగస్టు నెలతో పోలిస్తే 2025 ఆగస్టులో 5.5 శాతం పెరుగుదలను నమోదు చేశాయని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) బులెటిన్ తెలిపింది. వాణిజ్య బ్యాలెన్స్ 4.1 శాతం మిగులు వృద్ధిని నమోదు చేసింది. ఇది 24.2 బిలియన్ సౌదీ అరేబియా మొత్తం చమురుయేతర ఎగుమతుల్లో యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాలు 25.4 శాతం వాటాను కలిగి ఉండగా, రసాయన ఉత్పత్తులు 22.7 శాతంతో రెండవ స్థానంలో ఉన్నాయి.
దిగుమతి పరంగా చూస్తే.. యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాలు మొత్తం దిగుమతుల్లో 29.8 శాతం ఉన్నాయి. ఇది గతేడాది కంటే 24.7 శాతం పెరుగుదల నమోదైంది.
మరోవైపు చమురు ఎగుమతులు కూడా 7 శాతం పెరిగాయి. సౌదీ అరేబియా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగుతోంది. మొత్తం ఎగుమతుల్లో 16.2 శాతం మరియు మొత్తం దిగుమతుల్లో 26.4 శాతం వాటాను కలిగి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 11.1 శాతం ఎగుమతులు మరియు 5.4 శాతం దిగుమతులతో రెండవ స్థానంలో ఉండగా, ఇండియా 9.2 శాతం ఎగుమతులతో మూడవ స్థానంలో ఉంది. దమ్మామ్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఓడరేవు దిగుమతులకు ప్రధాన కేంద్రంగా, మొత్తంలో 25.6 శాతం ఎగుమతులు, దిగుమతులు ఇక్కడి నుండే జరిగాయి. ఆ తరువాత జెడ్డా ఇస్లామిక్ ఓడరేవు 21.9 శాతంతో రెండో స్థానంలో ఉందని స్టాటిస్టిక్స్ అథారిటీ బులెటిన్ తెలిపింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









